మన దేశ రాజధాని ఢిల్లీ లో భారత అగ్రశ్రేణి రెజ్లర్లు తమపై లైంగిక వేధింపులు జరిగాయనీ భారత రెజ్లింగ్ ఫెడరేషన్ సమాఖ్య అధ్యక్షులు బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ను వెంటనే అరెస్ట్ చెయ్యాలని,చర్యలు తీసుకోవాలని గత కొద్దికాలంగా మొక్కవోని దీక్షతో ,దృడ సంకల్పంతో,కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్నో ఆటంకాలు,అడ్డంకులు ఎదురైనా వాటన్నింటినీ లెక్క చెయ్యకుండా ఇప్పటికీ ఇంకా తమ నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి,లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న బిజేపి ఎంపీ డబ్లుఎఫ్ఐ అధ్యక్షులు బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ కు అండగా ఉన్నారనే ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ఈ నిరసనపై స్పందించి మాకు న్యాయం చేయాలని రెజ్లర్లు కన్నీటిపర్యంతమవుతూ నిన్న తీవ్ర నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలిసిందే.
కేంద్రం స్పందించినందుకు నిరసనగా తాము మన దేశంకోసం సాధించిన గొప్ప పథకాలను గంగలో కలిపేందుకు హరిద్వార్ చేరుకున్నారు.ఆ ప్రాంతంలో సుమారుగా ఇరవై నిమిషాలు పాటు మౌనదీక్ష చేశారు.తదనంతరం గంగా నది ఒడ్డుకు చేరుకొని పతాకాలను గంగలో కలిపేందుకు సిద్ధమయ్యారు.దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచెయ్యకుండా గొప్ప పథకాలను సాధించి ఇప్పుడు ఈ పథకాలను గంగలో నిమజ్జనం చేయాల్సి వస్తోందంటు రెజ్లర్లు కన్నీరుమున్నీరు అయ్యారు.అయితే చివరి క్షణంలో ఖాప్ మరియు రైతు సంఘాల నేతలు వారిని వారిస్తు కేంద్ర ప్రభుత్వానికి కొంత గడువు ఇద్దామని ప్రతిపాదన చేయడంతో రెజ్లర్లు ఆగిపోయారు.కేంద్ర ప్రభుత్వానికి ఐదు రోజుల గడువిస్తున్నామని ,ఆలోపు చర్యలు తీసుకోకపోతే మాత్రం పథకాలు గంగలో కలిపేస్తాం అని స్పష్టం చేశారు.