దక్షిణ భారతదేశాన్ని కుదిపేస్తున్న కన్నడ సీమ ఎన్నికలు...

తెలుగు,తమిళ,మలయాళ,మరాఠా,కొంకణి ప్రజల మద్దతు ఈసారి ఎవరికో మరీ ?

దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటక రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది.ఆరు రాష్ట్రాలతో సరిహద్దులను కర్ణాటక కలిగివుంది.తూర్పున ఆంధ్రప్రదేశ్,పశ్చిమాన గోవా,ఉత్తరాన మహారాష్ట్ర,దక్షిణాన కేరళ,ఈశాన్యంలో తెలంగాణ,ఆగ్నేయంలో తమిళనాడు రాష్ట్రాలతో సరిహద్దులను కలిగి ఉండడంతో ప్రస్తుత ఎన్నికలలో ఈ ప్రభావం కన్నడ సీమలో రసవత్తర రాజకీయాలకు తెరలేపింది.
దీనిని బట్టి చూస్తే కన్నడ సీమలో రాజకీయాలపై ఇతర భాషలు మాట్లాడే ప్రజల ప్రభావం కనిపించడంతో పాటు ఈ రాష్ట్రంలో కన్నడేతర జనాభా ఎక్కువ సంఖ్యలో ఉండడం వలన ఆయా వర్గాల రాజకీయ ప్రాతినిధ్యానికి బీజం వేసినట్లు కర్ణాటక రాష్ట్రం ఉంది.
భౌగోళికంగా ఆరు రాష్ట్రాలతో సరిహద్దులను కలిగిఉన్న కర్ణాటక రాష్ట్రంలో మరో తొమ్మిది రోజుల్లో జరగనున్న ఎన్నికలలో ఈ ఆరు రాష్ట్రాల నాయకుల మరియు కన్నడ సీమలో నివసిస్తున్న ఆయా రాష్ట్రాల ప్రజల ఓట్లు అన్నీ పార్టీలకు కీలకం కానున్నాయి.వారి ఓట్లను ప్రసన్నం చేసుకోవడం కోసం అన్నీ రకాల పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ జిమ్మిక్కులు ప్రయోగిస్తూ వినూత్న ప్రయత్నాలు సాగిస్తూ ఎవరికీ వారు ఓటర్లను ప్రసన్నం చేసుకొనే పనిలో బిజీ అయిపోయారు.
అతి త్వరలో జరగబోయే కన్నడ సీమ ఎన్నికలలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు వ్యక్తులు దాదాపుగా వందమందికి పైగా పోటీ చేస్తున్నారు.మరాఠా మూలాలను కలిగి ఉన్న వారి సుమారుగా యాభై మందికి పైగా పోటీ చేస్తున్నారు.తమిళులు ఈసారి పదిమందికి పైగా పోటీ చేస్తున్నారు.కర్ణాటక రాష్ట్రంలో కన్నడ మరియు ఉర్దూ భాషల తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు. బీదర్,కలబురిగి, యాద్గిర్,రాయచూర్ జిల్లాల్లో తెలుగు మాట్లాడే వారు అత్యధికంగా ఉన్నారు.ఈ నాలుగు జిల్లాలు మన తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి.
ఇక మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బార్డర్ ను బళ్ళారి, చిత్రదుర్గ, తుమ్కూరు,పావగడ,కోలార్, చిక్బలపూర్ జిల్లాలు కలిగి ఉన్నాయి.ఈ జిల్లాలలో అత్యధికంగా తెలుగు మాట్లాడేవారు ఉన్నారు.రెండు తెలుగు రాష్ట్రాల నేతలతో కన్నడ సీమలో గల ప్రధాన పార్టీలు ప్రచారానికి ప్రణాళిక రచించి అమలు చేస్తూ తెలుగు వారి ఓట్లు అత్యధికంగా కొల్లగొట్టి అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నంలో నిమగ్నమై పోయారు.
చామరాజనగర, రామనగర,బెంగుళూరు అర్భన్,కోలార్ జిల్లాలలో అత్యధికంగా తమిళ భాష మాట్లాడేవారు ఉండడంతో వారి ఓట్లను ప్రసన్నం చేసుకోవడానికి వినూత్న పద్దతుల్లో వ్యూహాలు సిద్దం చేసుకొని చివరి నిమిషంలో అమలు పరచడానికి సిద్దంగా ఉన్నారు
కన్నడ సీమ ప్రధాన పార్టీల నాయకులు.మైసూరు ,కొడగు జిల్లాల వంటి దక్షిణ కన్నడ జిల్లాల్లో మలయాళీలు పెద్ద సంఖ్యలో ఉండడంతో వారిని ఆకట్టుకొని ఆ ఓట్లను మాకే దక్కించుకొని అధికారాన్ని చేజిక్కించుకుంటాం అనే ధీమాతో ఎవరికీ వారు ప్రయత్నాలు సాగిస్తూ యుద్ద ప్రాతిపదికన వ్యూహాలను వివిధ రకాల ప్రధాన పార్టీలు అమలు చేస్తున్నారు.
గోవా రాష్ట్ర సరిహద్దులోని ఉత్తర కర్ణాటక మరియు బెలగావి జిల్లాల్లో కొంకణి భాష మాట్లాడే వారు ఉండడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు సాగిస్తున్నారు కన్నడ సీమ నేతలు.మహారాష్ట్ర సరిహద్దులోని విజయపుర,కలబురిగి, బీదర్,బెలగావి జిల్లాల్లో మరాఠా భాష మాట్లాడేవారు కూడా ఉండడంతో ఆ రాష్ట్రము నుండి ఈ రాష్ట్రానికి చరిష్మా గల నేతలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు.
ఇలా ప్రధాన పార్టీలు ఇతర భాషలు మాట్లాడే వారి ఓట్లను అత్యధికంగా తమ పార్టీకే వచ్చేలా వ్యూహ రచనలు చేస్తూ త్వరలో జరగబోయే ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.
మరాఠాల వైఖరి ఈసారి జరగబోయే ఎన్నికలలో ఏ పార్టీ వైపు నిలుస్తారో ? ఏ పార్టీనీ అందలం ఎక్కిస్తారో మరికొన్ని రోజుల్లో తేలనుంది.కన్నడ సీమలో గల బెళగావిని మహారాష్ట్రలో కలపాలని డిమాండ్ చేస్తున్న మహారాష్ట్ర ఏకీకరణ సమితి చేసిన రగడ ఈసారి ఎన్నికలలో గట్టిగానే ప్రభావం చూపనుంది.
2018 శాసనసభ ఎన్నికల్లో తెలుగువారు ఏకంగా ఇరవైమంది కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికవడం విశేషం. మరీ ఈసారి అదే సంఖ్య రిపీట్ అవుతుందా ? లేక ఏమైనా సీట్లు కొంతవరకు తగ్గుతాయా ? లేదా ఇంకాస్త సంఖ్య పెరుగుతుందా అనే విషయాలు మనకు తెలియాలంటే ఇంకో పన్నెండు రోజులు మనం ఎదురు చూడాల్సిందే తప్పదు మరీ!!
మా ఇంటెలిసెన్స్ సొల్యూషన్స్ తరుపున మా వీక్షకులకి కొన్ని ప్రశ్నలను పొందుపర్చాము.తమ అభిప్రాయాలను,భావాలను కామెంట్ల రూపంలో తెలియపర్చగలరు.అలాగే మేము మీకోసం అందించిన ఈ సందేశం వివరంగా చూసి మాకు ఏవైనా సలహాలు,సూచనలు అందిస్తారని ఆశిస్తూ ఎప్పటికప్పుడు ఇలాంటి తాజా వార్తలను మీకు అందివ్వడానికి మేము ఎల్లప్పుడు సిద్దంగా ఉంటాము అనే ఆత్మవిశ్వాసంతో మళ్లీ మరొక సందేశంతో మీ ముందుకు వస్తామని తెలియజేస్తూ వీక్షక మహాశయులకు ప్రత్యేక ధన్యవాదాలు....
  • (1). ప్రస్తుతం అతి త్వరలో జరగబోయే కర్ణాటక రాష్ట్ర ఎన్నికలలో తెలుగు,తమిళ,మలయాళ,మరాఠా, కొంకణి ప్రజల ప్రభావం ఖచ్చితంగా పడే సంకేతాలు ఏ మేరకు ఉంటాయని మీరు అభిప్రాయపడుతున్నారు ?
  • (2).ఈసారి జరగబోయే ఎన్నికల్లో మన తెలుగు వారు ఎన్ని సీట్లు సంపాదించుకుంటారని మీరు అభిప్రాయపడుతున్నారు ?
  • (3).భౌగోళికంగా కర్ణాటక రాష్ట్రం ఆరు రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకుంటుంది కదా మరి ఆ ఆరు రాష్ట్రాల ముఖ్య నేతల ప్రచార పర్వంలో ఏ పార్టీకి ఎక్కువ లాభం చేకూరుతుందని మీరు ఆశిస్తున్నారు ?
  • (4).కన్నడ సీమలో భాషేతరుల ప్రభావం ఎక్కువే మరియు పొరుగు రాష్ట్రాల ప్రజల నాయకుల ఇన్ఫ్లుయెన్స్ & ప్రచార పర్వం కూడా ఎక్కువే అని వివిధ వార్తా పత్రికలు మరియు ప్రముఖ టెలివిజన్ లో వచ్చిన కథనాలు ఎంత వరకు నిజం ? నిజంగానే వారు చెప్పినట్లు ,రాసినట్లు ఈసారి కన్నడ సీమ ఎన్నికల్లో వారి ప్రభావం అలా ఉందా ? మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు....
మా వీక్షకులకి మరొకసారి విన్నపం పైన తెలిపిన ప్రశ్నలకు సమాధానాలను కామెంట్ల రూపంలో తెలియజేసి పై సందేశం ను క్లుప్తంగా అభ్యసించి మీ అభిప్రాయాలను,మీ భావాలను మాకు తెలియజేయగలరు.